గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమావేశమవుతారు. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు విషయమై భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. జలాల తరలింపునకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రులు చర్చించారు. సీఎంల నిర్ణయానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీలు గతంలో ఉమ్మడిగా, విడివిడిగా చర్చించాయి. జలాల తరలింపునకు సంబంధించి వివిధ ప్రతిపాదనలను రూపొందించి పరిశీలించారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను ఇంజినీర్లు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై రేపటి సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. దీంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సహా ఇతర సమస్యలు కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు రానున్నాయి.
గోదావరి జలాలపై ప్రగతి భవన్లో చర్చలు
Related tags :