ScienceAndTech

మధుమేహులకు సూది గోల తప్పింది

This Contact Lens Tests Diabetes Without Contact And Injection

ప్రపంచ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాధిక‌న్నా ఎక్కువ భ‌య‌పెడుతున్న వ్యాధి డ‌యాబెటిక్‌. మారిన జీవ‌న విధానం కార‌ణంగా డ‌యాబెటిక్ రోగుల సంఖ్య ఏటేటా కోట్ల‌లో పెరుగుతున్న‌ది. ఈ వ్యాధి ఉన్న‌వారు శ‌రీరంలో షుగ‌ర్ స్థాయిలు ఎలా ఉన్నాయో త‌రుచూ ప‌రీక్షించుకొంటూ ఉండాలి. ఈ ప‌రీక్ష‌లు ఇప్ప‌టివ‌ర‌కు ర‌క్తం ద్వారా చేసేవారు. ఇక ఆ తిప్ప‌లు ఉండ‌ద‌ని అంటున్నారు ద‌క్షిణ‌కొరియా ప‌రిశోధ‌కులు. ఆ దేశంలోని పొహాంగ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ప‌రిశోధ‌కులు కంట్లో వాడే లెన్స్‌ను వినూత్నంగా రూపొందించారు. డ‌యాబెటిక్ రోగులు అవి ధరిస్తే చాలు ఎప్ప‌టిక‌ప్పుడు శ‌రీంలోని షుగ‌ర్ స్థాయిల‌ను అవి మానిట‌ర్ చేసి చెపుతాయి. వైర్‌లెస్ టెక్నాల‌జీతో ప‌నిచేసే ఈ లెన్స్ షుగ‌ర్ స్థాయిల‌ను అంచ‌నావేసి ఎప్పుడు మెడిసిన్ అవ‌స‌ర‌మవుతుంది, ద‌వాఖాన‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందా లేదా అనేది కూడా సూచిస్తాయి. భ‌విష్య‌త్తులో కంటి ద్వారానే మెడిసిన్ కూడా తీసుకొనేందుకు ఈ లెన్స్ ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని ఈ లెన్స్ రూప‌క‌ల్ప‌న‌కు నేతృత్వం వ‌హించిన డొహి కెయుమ్ తెలిపారు. కంటిలో ఉండే బ్ల‌డ్ లిడ్స్‌ను ప‌రీక్షించ‌టం ద్వారా ఇవి ప‌నిచేస్తాయ‌ని వెల్ల‌డించారు. ఈ లెన్స్ నిరంతరం గ్లూకోజ్ ను ప‌రిశీలించ‌ట‌మే కాకుండా రెటినోప‌తి ద్వారా చికిత్స కూడా అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ లెన్స్ చిప్ టెక్నాలజీ ద్వారా ప‌నిచేస్తుంది.