NRI-NRT

పారిస్‌లో బాపులపాడు యువకుడు మృతి

Avirneni Ramakrishna Dies In Paris Due To Lung Complications

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన అవిర్నేని ప్రవీణ్‌కుమార్‌(28) ఫ్రాన్స్‌లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఎంఎస్‌ చేస్తున్న ప్రవీణ్‌ ఊపిరితిత్తుల సమస్యతో కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేరి ఈ నెల 20న మరణించాడు. సహచర విద్యార్థులు, పారిస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్‌ మృతదేహం స్వస్థలానికి చేరేలా చర్యలు తీసుకోవాలంటూ తెదేపా ఎంపీ కేశినేని నాని శనివారం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా పారిస్‌ నుంచి ఈ నెల 27న బెంగళూరుకు వచ్చే విమానంలో మృతదేహం తీసుకొచ్చేలా అనుమతులు ఇవ్వాలని కోరారు.