Devotional

మే 14-17 మధ్య తెరుచుకోనున్న ఛార్‌ధామ్

2021 Char Dham Yatra To Start From May 14th

దేశంలోని ప్రఖ్యాత చార్‌ధామ్‌ (ఉత్తరాఖండ్‌) పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా వచ్చే భక్తుల కోసం దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను మే 17వ తేదీ ఉదయం 5 గంటలకు తెరవనున్నట్లు గురువారం వెల్లడించింది. అలాగే బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 18న.. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను అదే నెల 14న తెరవనున్నట్లు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నాలుగు ఆలయాలను మంచు కారణంగా మూసివేసిన తర్వాత ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు.