Business

జగ్గయ్యపేటలో 1756 సీసాల అక్రమ మద్యం స్వాధీనం-నేరవార్తలు

జగ్గయ్యపేటలో 1756 సీసాల అక్రమ మద్యం స్వాధీనం-నేరవార్తలు

* కృష్ణా జిల్లా..జగ్గయ్యపేట మండలం..అనుమంచిపల్లి వద్ద సిమెంట్ లారీ లో అక్రమంగా తరలిస్తున్న 1766 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

* కడప జిల్లా…భార్యను చంపిన కసాయి భర్త…కడప నగరం రవీంద్ర నగర్ లో అనుమానం పెంచుకుని భార్యపై భర్త కత్తితో దాడి..భార్య బీబీజాన్ అక్కడికక్కడే మృతి… అడ్డొచ్చిన మరదలు గౌసియాపై కూడా కత్తులతో దాడి…మరదలు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలింపు..సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న కడప తాలూకా పోలీసులు.

* దువ్వాడ vsezలో పూజా కంపెనీలో అగ్నిప్రమాదం, మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

* చిత్తూరు జిల్లా పుంగనూరు బాలాజీ థియేటర్ వద్ద సినీ ఫక్కీ తరహాలో చోరీ..వధువు పెళ్లికి బంగారం కొనడం కోసం వెళుతున్న వ్యక్తి కారులో ఆరు లక్షల ఎనభై వేల డబ్బు,120గ్రా౹౹బంగారం చోరీ..కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు.

*
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 45 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎటావా జిల్లాలోని ఉడి-చక్కర్‌నగర్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. భక్తులతో ఆగ్రా నుంచి ఎటావా జిల్లాలోని కాళికాదేవి ఆలయానికి వస్తున్న ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న 35 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఎటావా ఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.