Business

రూ. 197కే బీఎస్ఎన్ఎల్ ఆకర్షనీయమైన ప్రీపెయిడ్ ప్లాన్ – TNI వాణిజ్యం 08/02/2022

రూ. 197కే బీఎస్ఎన్ఎల్ ఆకర్షనీయమైన ప్రీపెయిడ్ ప్లాన్  – TNI వాణిజ్యం 08/02/2022

* బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్.. రూ. 197కే 150 రోజుల వ్యాలిడిటీ
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్యాక్ తీసుకొచ్చింది. ఈ ప్యాక్ విలువ రూ. 197 మాత్రమే. 150 రోజుల కాలపరిమితితో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత కాల్స్, ఉచిత ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది.అయితే డేటా, అపరిమిత కాల్స్‌పై మాత్రం పరిమితి ఉంది. రీచార్జ్ చేసుకున్నప్పటి నుంచి తొలి 18 రోజులు మాత్రమే 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఆ తర్వాత మిగతా కాలానికి డేటా స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. అయితే, ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రం వస్తుంటాయి. అవుట్ గోయింగ్ కాల్స్ చేయాలనుకుంటే మాత్రం టాపప్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కాలపరిమితి ఉన్నంత వరకు ఉచిత మెసేజ్ సర్వీసు ప్రయోజనాలు మాత్రం అందుబాటులో ఉంటాయి

* బీఎస్‌ఎన్‌ఎల్‌ భూముల వేలం తుస్‌ ?
ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన కీలకేతర ఆస్తులు అమ్మాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. హైదరాబాద్‌తో పాటు పంజాబ్‌లోని రాజ్‌పురా, గుజరాత్‌లోని భావ్‌నగర్‌, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఆరు కీలకేతర బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆస్తులను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఇందులో హైదరాబాద్‌లోని 11 ఎకరాల అమ్మకం ద్వారానే కనీసం రూ.402 కోట్లు లభిస్తాయని అంచనా వేసింది. ఈ ఆస్తుల అమ్మకం కోసం ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) గత ఏడాది నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు ముందు హైదరాబాద్‌ బీఎ్‌సఎన్‌ఎల్‌ భూములపై ఆసక్తి చూపిన ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు తీరా బిడ్డింగ్‌ దగ్గరకు వచ్చే సరికి ఒక్క బిడ్‌ కూడా వేయలేదు.పంజాబ్‌లోని రాజ్‌పురాలోని 20 ఎకరాలు, భావ్‌నగర్‌లోని ఐదు ఎకరాలు, కోల్‌కతాలోని 11 ఎకరాల భూములదీ ఇదే పరిస్థితి. దీంతో ఖంగుతిన్న ప్రభుత్వం ఇందుకు కారణాలను అన్వేషించే పనిలో పడింది. ఈ ఆస్తుల కోసం పోటీపడే సంస్థలు, వ్యక్తుల నికర ఆస్తుల విలువ ఎక్కువగా నిర్ణయించడం ఇందు కు ప్రధాన కారణమని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు నివేదించాయి. హైదరాబాద్‌లోని రూ.402 కోట్ల విలువైన 11 ఎకరాల కోసం పోటీపడే సంస్థల కనీస నికర ఆస్తు ల విలువను రూ.100 కోట్లుగా నిర్ణయించడం.. ఒక్క బిడ్‌ రాకపోవడానికి ప్రధాన కారణమని తెలిపాయి. దీంతో నికర ఆస్తుల పరిమితి మరింత తగ్గించి త్వరలో మరోసారి బిడ్స్‌ ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన భూములు, భవనాల వంటి కీలకేతర ఆస్తుల అమ్మకం ద్వారా కనీసం రూ.3,000 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముంబైలోని ఎంటీఎన్‌ఎల్‌ రెసిడెన్షియల్‌ ఫ్లాట్ల కొనుగోలుకు మాత్రమే కొద్ది బిడ్స్‌ అందినట్టు సమాచారం

* ఈవీలో సెగ్మెంట్‌లో హైదరాబాద్‌ హవా.. మెక్సికన్‌ మార్కెట్‌పై ఫోకస్‌
ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో హైదరాబాద్‌ హవా కొనసాగుతోంది. గత రెండు మూడేళ్లుగా ఈవీ సెగ్మెంట్‌లో పని చేస్తున్న కంపెనీలు ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయి. తాజాగా సెలెస్టియల్‌ ఈ మొబిలిటీ సంస్థ తమ ఈ ట్రాక్టర్లను మెక్సికన్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది.సెలెస్టియల్‌ ఈ మొబిలిటీ కంపెనీ 2019లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ మొత్తం 35 రకాల వాహనాలను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 2500 డీలర్‌షిప్‌ కేంద్రాలతో పాటు 800 సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయి. 2020 మార్చిలో ఇ ట్రాక్టర్‌ను ప్రవేశపెట్టగా మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1800 ట్రాక్టర్లు బుక్‌ అయ్యాయి. ఇ ట్రాక్టరులో 150 ఏఎహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ అమర్చారు. ఇ ట్రాక్టర్‌లో 18 బీహెచ్‌పీ, 15 ఎన్‌ఎం టార్క్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది.

*ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌… ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం పేరుతో కొత్త టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. లైఫ్‌ స్టేజ్‌ కవర్‌, లెవల్‌ కవర్‌ పేరుతో రెండు పథకాలు అందుబాటులో ఉంటాయి. అన్ని ప్రీమియంలపై 105 శాతం వరకు రిటర్నులు ఇవ్వటం వీటి ప్రత్యేకత. 60 లేదా 70 ఏళ్లు లేదా పాలసీ మెచ్యూరిటీపై ఈ రిటర్నులు అందించనుంది. 64 కీలకమైన రుగ్మతలకు కవరేజీ కల్పించటంతో పాటు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ పాలసీని రూపొందించింది.

*స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.8,432 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.5,196 కోట్లతో పోల్చితే ఇది 62.27 శాతం అధికం. ఒక త్రైమాసికంలో అత్యధిక లాభం ఇదే కావడం విశేషం. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదా యం రూ.75,981 కోట్ల నుంచి రూ.78,352 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 6.48 శాతం వృద్ధితో రూ.30,687 కోట్లకు పెరిగింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.34 శాతం నుంచి 3.40 శాతానికి మెరుగుపడింది.

*డిసెంబరు త్రైమాసికంలో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.778.5 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.535.5 కోట్లుగా ఉన్నాయి. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 88 శాతం వృద్ధితో రూ.1,456 కోట్లకు పెరిగింది.

*కరోనా మహమ్మారి జీవితాలను ఛిద్రం చేసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో గృహస్థులు చారిత్రక రికార్డు స్థాయి లో పొదుపు చేశారు. ఆ సంవత్సరం గృహస్థుల పొదుపు రూ.7.1 లక్షల కోట్లుంది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇళ్లకే పరిమితమైన గృహస్థులు ముందు జాగ్రత్త చర్యగా లేదా నిర్భందంగా పొదుపు పెంచుకున్నారని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు ఒక నివేదికలో తెలిపారు.

*ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స (ఐఎ్‌సబీ) విద్యార్థులకు ఉద్యోగాల పంట పండింది. ఐఎ్‌సబీ హైదరాబాద్‌, మొహాలీ క్యాంప్‌సల్లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ) విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేందుకు ఈ ఏడాది ఏకంగా 270 కంపెనీలు పోటీపడ్డాయి

*జర్మనీకి చెందిన ‘నింబస్‌ హెల్త్‌ జీఎంబీహెచ్‌’ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌ ఔషధ తయారీ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. 2018లో ఏర్పాటైన నింబస్‌ హెల్త్‌.. వైద్య అవసరాల కోసం గంజాయిని టోకుగా విక్రయించేందుకు లైసెన్సు కలిగి ఉన్న ప్రైవేట్‌ కంపెనీ. అప్‌ఫ్రంట్‌ చెల్లింపులతో పాటు వచ్చే నాలుగేళ్లలో నింబస్‌ హెల్త్‌ పనితీరు, ఆదాయ మైలురాళ్ల ఆధారంగా ఈ కొనుగోలును చేపట్టినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. అయితే, డీల్‌ విలువను మాత్రం వెల్లడించలేదు.

*వేగంగా దూసుకుపోయే అధునాతన వందే భారత్‌ ట్రెయిన్ల తయారీ కోసం మేధా సర్వో డ్రైవ్స్‌ అనే హైదరాబాద్‌ కంపెనీ పోటీ పడుతోంది. బొంబార్డియర్‌, సీమెన్స్‌, భారత్‌ హెవీ ఎలక్ర్టికల్స్‌తో పాటు మేధా సర్వో డ్రైవ్స్‌ కంపెనీ ఇందుకోసం ఇప్పటికే బిడ్‌ సమర్పించినట్టు సీనియర్‌ అధికారులు తెలిపారు. 2023 ఆగస్టునాటికి 75 వందే భారత్‌ ట్రెయిన్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఇప్పటికే 44 ట్రెయిన్ల తయారీ చేపట్టారు. మరో 58 ట్రెయిన్లకు ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ను సమీకరించే ప్రక్రియను రైల్వేస్‌ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వచ్చే మూడేళ్లకాలంలో 400 వందే భారత్‌ ట్రెయిన్లను తయారు చేయాలన్నది లక్ష్యం.