అల్లు అర్జున్పై బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్ స్టార్కిడ్స్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్లో ప్రేక్షకులు తమను చూసుకున్నారు కాబట్టి ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకొని బ్లాక్బస్టర్ అయిందన్నారు. ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలు పుష్పరాజ్ లాంటి సాధారణ కూలీ పాత్రను పోషించడానికి ఇష్టపడరు అని ఆమె చెప్పారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ను ‘బాయిల్డ్ ఎగ్స్’ అంటూ హేళన చేశారు. ఇప్పుడు హిందీ పరిశ్రమ కన్నా దక్షిణాది సినిమాలు ఎక్కువ విజయాలు సాధిస్తున్నాయన్నారు. దక్షిణాది హీరోలు తమ మూలాలను మరవకపోవడమే అందుకు కారణమని ఆమె చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనవడం వల్ల బాలీవుడ్ స్టార్కిడ్స్ వేష, భాషలు పూర్తిగా మారిపోయాయనీ, అందుకే భారతీయ ప్రేక్షకులు వారితో కనెక్ట్ అవ్వలేకపోతున్నారని కంగన అన్నారు. ఆమె నటించిన ‘ధాక్కడ్’ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది.