Politics

వెంకయ్యనాయుడు 4 రోజుల విశాఖ పర్యటన

వెంకయ్యనాయుడు 4 రోజుల విశాఖ పర్యటన

విశాఖపట్నం, సూర్య బ్యూరో ప్రతినిధి : భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం రానున్నారు. అక్టోబర్ 30 ఆదివారం ఉదయం విమాన మార్గంలో విశాఖపట్నం చేరుకుంటారు. ఆనంతరం పోర్ట్ అతిథిభవనం చేరుకుని బస చేస్తారు. అక్టోబర్ 30 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గీతం యూనివర్సిటీలో కోనేరు రామకృష్ణారావు భవన్ ను గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు అంకితం చేస్తారు. అక్టోబర్ 30 ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదిక ద్వారా ప్రణవపీఠం శతావధానం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్టోబర్ 31 సోమవారం ఉదయం 9.30 గంటలకు వాల్తేర్ క్లబర్ దగ్గరలో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. నవంబర్ 2 బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డా. వై.వి.ఎస్. మూర్తి ఆడిటోరియంలో శ్రీ జి.ఎం.సి.బాలయోగి స్మారక ఉపన్యాసం చేస్తారు. నవంబర్ 3 గురువారం తెల్లవారు జామున కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో రైలు మార్గంలో ఏలూరు బయలుదేరి వెళతారు.