NRI-NRT

సౌదీ అరేబియాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

సౌదీ అరేబియాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జూమ్ సమావేశ సూచన మేరకు సౌదీ అరేబియా లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన ప్రవాస భారతీయులందరినీ ఒకచోటకు చేర్చి వారి కుటుంబంలో గానీ వారి మిత్రులు గాని బంధు వర్గంలో గాని వారి గ్రామ పరిసర ప్రాంతాలలో ఎమ్మెల్సీ ఓటు హక్కు ను తెలుగుదేశం కు అనుకూలంగా వేసే విధంగా ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఓటర్లకు చరవాణి ద్వారా మార్చి 13వ తేదీ సోమవారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పవిత్రమైన మొదటి ప్రాధాన్యత ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసినదిగా సౌదీలోని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారధి నాయుడు కోరడమైనది. ఈ కార్యక్రమంలో గౌరయ్య, కుమార్, నగరం గోపి, గుణశేఖర్, చక్రపాణి, రమేష్, చంద్రబాబు, ప్రసాద్, సురేష్, మోహన్, రాజు,సుమన్,వేణుగోపాల్, రమణారెడ్డి,హేమాద్రి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.