Movies

రెండు రోజుల్లో తారక్ 30 యాక్షన్ ముగింపు!

రెండు రోజుల్లో తారక్ 30 యాక్షన్ ముగింపు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం నుంచి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగు తోంది. దీనిలో భాగంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్-తారక్ మధ్య భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు. ఈ ఫైట్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ రైల్ సెట్ ని నిర్మించారు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసారు.

ఆ సెట్ లో నే నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా షూట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. మరో రెండు ఈ రోజుల్లో ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణ ముగుస్తుందని చిత్ర బృందం రివీల్ చేసింది. అటుపై అదే స్టూడియో లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించ నున్నట్లు సమాచా రం. ఈ షెడ్యూల్ కొనసాగింపులో భాగంగానే చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది.

తారక్ తో పాటు జాన్వీకపూర్ పై కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే విదేశాలు వెళ్లనున్నట్లు సమాచారం. కీలక మైన నటీనటులు మాత్రమే విదేశాలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

విస్మరణకు గురైన ఓ తీరప్రాంతం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటికే ఎన్టీఆర్ మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు ఆకాశాన్నంటడం మొదలైంది. టీజర్..ట్రైలర్ రిలీజ్ అయితే అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. అలాగే జాన్వీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఎంతో మంది నాయికలు ఉన్నా ఏరికోరి మరీ జాన్వీని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు.

సాధారణంగా కొరటాల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కేవలం పాటలకు ..గ్లామర్ సన్నివేశాలకే పరిమితం కాకుండా కథలో భాగంగానే పాత్రలు వచ్చేలా తీర్చి దిద్దడం కొరటాల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ పాత్రపై ఆసక్తి రెట్టింపు అవుతుంది.