Politics

సాంస్కృతిక సారధి ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త

సాంస్కృతిక సారధి ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త

తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ. పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹24514 గా ఉంది. ఇక పీఆర్సీ అమలుతో ఒక్కొక్కరికి ₹ 7300ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా గోలి శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్ రెడ్డికు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.