Devotional

బాసర సరస్వతి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం

బాసర సరస్వతి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం

నిర్మల్‌ జిల్లా బాసర ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలపై ఫంగస్‌ కనిపించడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంగస్‌తో వేల సంఖ్యలో లడ్డూలు పాడవగా.. వాటిని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలు కాగా.. సిబ్బంది నిర్వాకంతో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z