Politics

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం తథ్యం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం తథ్యం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం తథ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌(ట్వీట్‌) చేశారు. కాంగ్రెస్‌ విజయం.. ప్రజల తెలంగాణతో స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాష్ట్రంలో పర్యటించిన రాహుల్‌ గాంధీ పినపాక, నర్సంపేట, వరంగల్‌ ఈస్ట్‌, నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌కు ‘ప్రజా పాలన భవన్‌’ అని పేరు మారుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ భవన్‌ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారని ప్రకటించారు. జవాబుదారీతనం, పారదర్శకత కోసం ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా తమతో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z