Business

జియో వినియోగదారులకు శుభవార్త

జియో వినియోగదారులకు శుభవార్త

రిలయన్స్‌ జియో వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల రీఛార్జ్‌ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇతర టెలికాం కంపెనీలకు పోటీగా జియో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకువస్తూ వినియోగదారులను పెంచుకుంటోంది. ప్రస్తుతం చాలా మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. వారికి ఎంత డేటా ఉన్న సరిపోని పరిస్థితి ఉంది. అలాంటి వారికి డేటా ప్యాక్‌ను ప్రవేశపెడుతోంది. ఇటీవల జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 12 ఓటీటీలు లభించేలా రూపొందించింది.

అయితే ప్లాన్‌ కేవలం రూ.148 ప్లాన్‌ డేటా ప్యాక్‌ మాత్రమే. ఇందులో కాల్స్‌ గానీ, ఎస్‌ఎంఎస్‌లు గానీ ఉండవు. ఈ ప్లాన్‌లో మొత్తం 10 జీబీ డేటా లభిస్తుండగా, వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఈ ప్యాక్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే బేస్‌ ప్లాన్‌ తప్పకుండా ఉండాల్సిందేనని జియో స్పష్టం చేస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకున్న వారికి జియో సినిమా ప్రీమియం, జీ 5, సోనీలివ్‌, డిస్కవరీ+, లయన్స్‌గేట్‌, సన్‌నెక్ట్స్‌ సహా మొత్తం 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయని జియో వెల్లడించింది. ఈ ఓటీటీలన్ని కూడా జియో టీవీ ప్రీమియంలో భాగంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా జియో సినిమా ప్రీమియం కూపన్‌ మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్‌ చేసుకోవచ్చు. డేటా వినియోగించుకునే వారు ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z