DailyDose

ఏపీలో 1.52కోట్ల ఆయుష్మాన్ కార్డులు నమోదు

ఏపీలో 1.52కోట్ల ఆయుష్మాన్ కార్డులు నమోదు

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1.52 కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధిక కార్డులున్న రాష్ట్రాల్లో ఏపీ 9వ స్థానంలో నిలిచినట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ నెల 12 నాటికి దేశ వ్యాప్తంగా 30కోట్ల కార్డులు నమోదవగా.. 4.8కోట్ల కార్డులతో ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, రాజస్థాన్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఆసుపత్రి అడ్మిషన్లలో తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి. ఏపీలో ఇప్పటివరకు 49.67 లక్షల ఆసుపత్రి అడ్మిషన్లు జరిగాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యధికంగా 64.05 లక్షల మందికి డయాలసిస్‌ చికిత్సలు జరిగాయి. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజి ఇస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z