ప్రవాస తెలుగుదేశం పార్టీ (NRITDP-USA) ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్ నగరంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన మహానాడు ప్రారంభ కార్యక్రమం వైభవంగా జరిగింది. అమెరికా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ MVVS.రాజు, కందుల నారాయణరెడ్డి, గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే వైవి.ప్రభాకరచౌదరి, నల్లారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎన్నారై తెదేపా కన్వీనర్ కోమటి జయరాం స్వాగతం పలికారు. అమెరికాలోని తెలుగు ప్రముఖులు నాదెళ్ళ గంగాధర్, జయశేఖర్ తాళ్లూరి, కొల్లా అశోక్ బాబు, రవి మందలపు, వేమన సతీష్, కేసీ చేకూరి, విద్యా గారపాటి, చండ్ర దిలీప్ కుమార్, నరేన్ కొడాలి తదితరులు హాజరయ్యారు. సినీ సంగీత దర్శకుడు కోటి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఉర్రూతలూగించింది. నిర్వాహకులు ముందుగా ప్రకటించిన విధంగానే అద్భుతమైన రీతిలో తెలుగు వంటకాలతో భారీగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుండి రెండోరోజు మహానాడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. తొలిరోజు మహానాడు ప్రారంభ దృశ్యాలు ఇక్కడ వీక్షించండి…