తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరాన పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేక ఏంటంటే, పార్వతీ దేవి చేయిపట్టుకుని పరమేశ్వరుడు పాణిగ్రహణం చేస్తున్నట్లు విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆదిదంపతులకు వివాహం జరిగిన పవిత్ర స్థలంగా భక్తులు భావిస్తారు. ఇక్కడున్న పరమేశ్వరుడు కళ్యాణసుందరమూర్తిగా పార్వతీదేవి కోకిలాంబాళ్గా ప్రసిద్ధికెక్కారు. ఈ మూర్తులను మొక్కి కోరికలు కోరిన వారికి వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతాయని నమ్మకం. పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతుంటే, యువతీయువకులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. ఆదిదంపతులను పుష్పమాలలతో అలంకరించి పూజిస్తే వెంటనే పెళ్ళిళ్లు జరుగుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో మరోప్రత్యేకత కూడా ఉంది. నవగ్రహాలలో ఒకరైన రాహువు లింగరూపంలో ఉంటుంది. రాహువు పీడితులుగా ఉన్నవారు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారు.
తంజావూరు కళ్యాణ శివుడి ఆలయం తెలుసా?
Related tags :