Movies

మార్పులు తీసుకొచ్చింది

changes to rrr story for shraddha kapoor

బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కోసం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో మార్పులు చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌, తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆమె స్థానంలో శ్రద్ధను ఎంపికచేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. శ్రద్ధ కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమాకు శ్రద్ధా కపూర్‌ డేట్స్‌ కుదరకపోతే.. పరిణీతి చోప్రాను ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం అనుకుంటోందట. అయితే.. ఈ సినిమాలో స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటనలను చూపించబోతున్నారు కాబట్టి.. తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటినే ఎంపికచేసుకోవాల్సి ఉందట. ‘ఇప్పటికిప్పుడు డైసీకి బదులు మరో బ్రిటిష్‌ నటిని తీసుకురావడం కుదరదు. ఇందుకోసం క్యాస్టింగ్‌ ఏజెన్సీలతో మాట్లాడాలి. అదో పెద్ద ప్రక్రియ. అందుకే చిత్రబృందం భారతీయ నటీమణులనే ఎంపిక చేసుకోవాలని అనుకుంటోంది. వారికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారు’ అని దక్షిణాది వర్గాలు తెలిపాయి. అయితే చిత్రబృందం నుంచి మాత్రం కథానాయిక విషయం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.