Business

30కోట్ల భారతీయుల అభిమానం చూరగొన్న జియో

Jio user base crorsses 300million Indians - tnilive - 30కోట్ల భారతీయుల అభిమానం చూరగొన్న జియో

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో రోజురోజుకీ తన మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. జియో రాకతో ప్రధాన టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు తమ కస్టమర్లను కోల్పోతున్నారు. ఒక్క మార్చి నెలలోనే ఎయిర్‌టెల్‌ 1.51కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 1.45కోట్ల మంది కస్టమర్లను కోల్పోగా.. జియోకు మాత్రం అదనంగా 94లక్షల మంది ఖాతాదారులు చేరారు. దీంతో రిలయన్స్‌ జియో ఖాతాదారుల సంఖ్య 30కోట్లు దాటింది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) డేటా వెల్లడించింది.