Agriculture

యాదాద్రిలో పంటపొలంలో లంకెబిందెలు

Vintage pottery found in agricultural field in yadadri telangana india

మండలంలోని అజీంపేట గ్రామ శివారులో గల ఓ పంట పొలంలో పురాతన కాలం నాటి వస్తువులు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన లింగాల రామస్వామి అనే రైతు తన పంట పొలాన్ని డోజర్‌తో చదును చేస్తుండగా పురాతన వస్తువులు బయటపడ్డాయి. వీటిలో ఆరు రాగి బిందెలు, ఇత్తడి గంగాలం, కూజా ఆకారంలో ఉన్న వస్తువులు మూడు, చిన్న చిన్న వస్తువులు.. ఇలా సుమారు 20వరకూ ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఎం.డీ.ఇద్రిస్‌ఆలీ, రెవెన్యూ సిబ్బంది వస్తువులు లభ్యమైనచోటుకు చేరుకొని పరిశీలించారు. అనంతరం పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.