NRI-NRT

చికాగోలో పద్మశాలీయుల వనభోజనాలు

NAPA North American Padmashali Association Celebrates Summer Picnic In Chicago

నాపా (నార్త్‌ అమెరికా పద్మశాలీ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వనభోజనాల కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 250 పద్మశాలీ కుటుంబాలు పాల్గొన్నాయని నాపా తెలిపింది. స్వర్గీయ అజయ్‌ మెతుకు(నాపా వ్యవస్థాపకులు)కు నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అందరూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వంటకాలతో అంరదరి నోరూరించారు. చికాగో బృందం పద్మశ్రీ రామారావు (పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షుడు) సత్కరించింది.ఈ ఈవెంట్‌ను నిర్వహించిన చికాగో చాప్టర్‌ డైరెక్టర్‌ రాజ్‌ అడ్డగట్ల, బోర్డ్‌ సభ్యులు ఈశ్వర్‌ గుమిడ్యాల, వేణు పిస్కా, ట్రెజరర్‌ రామ్‌రాజ్‌ అవదూత.. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను సత్కరించారు. టీమ్‌ సభ్యులు రాజ్‌ గెంట్యాల, శ్రీమాన్‌ వంగరి, రవి కూరపాటి, శ్రీనివాస్‌ దామర్ల, విమల్‌ దాసి, శ్రీనివాస్‌ కైరంకొండ, సాయిరామ్‌ పసికంతి, ప్రవీణ్‌ కటకం, శ్రీనివాస్‌ వేముల సహాకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని నాపా తెలిపింది. 2019 సెప్టెంబర్‌ 14న జరిగే వార్షికోత్సవానికి హాజరు కావల్సిందిగా కార్యక్రమానికి పాల్గొన్నవారందరినీ కోరారు. ఈ కార్యక్రమానికి నాపా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సంతోష్‌ అంకెం, దేవాంగ్‌ అసోసియేషన్‌ ఫౌండర్‌ వెంకటేశ్వర్‌ రావు బట్చు, రవి బోధులా హాజరయ్యారు.
NAPA North American Padmashali Association Celebrates Summer Picnic In Chicago

NAPA North American Padmashali Association Picnic In Chicago