Sports

మేరీకోమ్ స్వర్ణం కొట్టింది

Mary Kom Grabs Gold In Presidents Cup

ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్‌ మేరీకోమ్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం మహిళల 51 కేజీల విభాగంలో ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్‌ ఫ్రాంక్స్‌ ఏప్రిల్‌తో జరిగిన పోరులో కోమ్‌ 5-0తో విజయం సాధించింది. ఇంతకుముందు సెమీఫైనల్లో వియత్నాంకు చెందిన అన్హ్‌ వో కిమ్‌తో జరిగిన పోరులో 3-2తో విజయం కోసం చెమటోడ్చిన మేరీకోమ్‌.. ఫైనల్లో మాత్రం అలవోకగా విజయం సాధించింది. బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ ఈ ఏడాది మేలో జరిగిన భారత ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లోనూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సెప్టెంబర్‌ 7నుంచి 21 తేదీల్లో రష్యాలో జరగనున్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2019లో మేరీకోమ్‌ పాల్గొననుంది.