WorldWonders

పదోతరగతి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థుల అత్యాచారం

పదోతరగతి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థుల అత్యాచారం

పదోతరగతి చదువుతున్న బాలుడిపై మరో ముగ్గురు ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన చాంద్రాయణగుట్టలోని ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వెలుగు చూసింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఈ ఉదంతం బయటపడింది. భవానీనగర్‌ ఠాణా పరిధిలో నివసించే ఓ బాలుడు గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు అతడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టారు. ఇటీవల బాధితుడి తండ్రి పాఠశాలకు రాగా అతడు నీరసంగా కనిపించాడు. ఏమిటని ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. వెంటనే తండ్రి శుక్రవారం చాంద్రాయణగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.