‘పంతం’ తర్వాత గోపీచంద్ నటిస్తున్న సినిమా ‘చాణక్య’. మెహరీన్ కథానాయిక. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ స్టైలిష్గా కనిపించారు. యాక్షన్కు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ 25వ సినిమాగా ‘పంతం’ తెరకెక్కింది. మెహరీన్ కథానాయిక. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
చాణక్యుడి టీజర్ వచ్చేసింది
Related tags :