రాష్ట్రంలో కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్ఠగా మారిందని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మీడియతో మాట్లాడుతూ.. సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించింది కేవలం రూ.2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో కేసీఆర్ నియంతృత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ రాచరికాన్ని ఓడించండి
Related tags :