Politics

జనసేనకు కమ్యూనిస్టుల మెలిక

CPI CPM Twists Support To Janasena

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సీపీఐ, సీపీఎం నేతలు మెలికపెట్టారు.

ఇసుక సంక్షోభంపై విశాఖలో జనసేన నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్‌కు సంఘీభావం ప్రకటిస్తూనే బీజేపీ సహకారం తీసుకోవడంపై అభ్యంతరం చెబుతున్నారు.

పవన్‌‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు.

ఇసుక సంక్షోభంపై విశాఖలో లాంగ్‌ మార్చ్‌కు బీజేపీ సహకారం తీసుకోవాలనుకుంటున్న… మీ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

అందువల్ల మీరు చేపట్టే కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నామని, ఇసుక సమస్యపై ఇప్పటికే సీపీఐ, సీపీఎం పార్టీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయని తెలిపారు.

మీరు ఈ విషయాన్ని గమనించారని భావిస్తున్నామని లేఖలో రామకృష్ణ, మధు పేర్కొన్నారు.