తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. సీఎం జగన్ ఆదేశాలతో తితిదే తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. తాజాగా సీఎం ఆదేశంతో మళ్లీ ఆయన్ను తీసుకున్నారు. ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులు నిర్వర్తించనున్నారు. వైఖానస ఆగమశాస్త్రంలో ఆయన అనుభవం, పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తన నియామకం నేపథ్యంలో రమణదీక్షితులు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిశారు.
తితిదే ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు
Related tags :