Devotional

అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి

Ayyappa Temple In Sabarimala Opened Today-Nov 2019

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు దర్శనానికి బయల్దేరారు. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. నేటి నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అచంచలమైన భక్తి ప్రపత్తుల మధ్య నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ ప్రారంభ దర్శనానికి పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా దాదాపు 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.