WorldWonders

నిత్యానందపై చిన్నారుల కిడ్నాప్ కేసు

Kidnap Case Lodged On Swami Nithyananda

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. ఆయన అనుచరులు పిల్లల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అహ్మదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అహ్మదాబాద్‌లోని ఆయన అనుచరులైన సాధ్వీ ప్రణప్రియానంద, ప్రియతత్వ రిద్ది కిరణ్‌ అనే మహిళల్ని అరెస్టు చేశారు. వీరిద్దరూ ‘యోగిని సర్వగ్యపీఠం’ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ మహిళలు నలుగురు చిన్నారులను కిడ్నాప్‌ చేసి ఓ ఫ్లాట్‌లో అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా ఆ చిన్నారులను బాలకార్మికులుగా మార్చి వారితో ఆశ్రమ ప్రచార కార్యకలాపాలు, డొనేషన్ల వసూళ్లకు వాడుకుంటున్నారు. ఫ్లాట్‌ నుంచి రక్షించిన చిన్నారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిత్యానంద స్వామిపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.