రాష్ట్రంలో రేపటి నుంచి అమలు కానున్న ఆర్టీసీ ఛార్జీల పెంపు
పెంచిన ఛార్జీలు రేపు మొదటి నుంచే నుంచే అమలు
సవరించిన చార్జీలతో పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ
పల్లెవెలుగు బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు పెంపు
ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కి.మీ.కు 20 పైసలు పెంపు
ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు చార్జీ పెంపు
వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదు: ఆర్టీసీ
సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదు: ఆర్టీసీ
పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు అనగా 10 కి.మీ. వరకు ఛార్జీల పెంపుదల లేదు: ఆర్టీసీ
తదుపరి 75 కి.మీ. వరకు రూ.5 ఛార్జీ పెంపు: ఆర్టీసీ
డీజిల్ ఛార్జీలు నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి పెరిగాయి: ఆర్టీసీ
డీజిల్ ధరల పెంపు వల్ల సంస్థకు ఏటా రూ.630 కోట్ల అదనపు భారం: ఆర్టీసీ
విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో రూ.650 కోట్ల భారం: ఆర్టీసీ
నష్టాన్ని భర్తీ చేసేందుకే ఆర్టీసీ చార్జీలు పెంచాం -ఆర్టీసీ