Editorials

కేసీఆర్ ఒకేఒక్క నిర్ణయంతో రామోజీరావుకు ఊహించని దెబ్బ

KCR's Decision Blows Ramojirao Out Of The Blue

సినీ, మీడియా రంగంలో చక్రవర్తిగా పేరొందిన రామోజీరావు రాజకీయంగా కూడా చాలా పవర్ ఫుల్ క్యాండిడేట్ అని అందరికీ తెలుసు. తెదేపాకి అండగా ఉంటారని తన పత్రికలో కూడా తెదేపాకి అనుకూలంగా ఉంటాయని చాలా మంది రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తుంటారు. అటువంటి రామోజీరావుకి 2014 ఎన్నికల గెలిచిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ చాలా సన్నిహితంగా ఉండడం అందరికీ అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉమ్మడి ఏపీలో కేసేఆర్ తెలంగాణా కోసం పోరాడుతున్న సమయంలో ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తాని భయంకర వ్యాఖ్యలు చేసిన ఎన్నికల్లో గెలిచాక కేసీఆర్ ప్లేట్ ఫిరాయించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సిఎంగా ఎన్నికైన కేసీఆర్ ఓం సిటి అనే బృహతర ప్రాజెక్టు విషయంలో రామోజీ- కేసీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ఇటీవల ఏపీ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం పరిస్థితులు మారిపోయాయి. జగన్‌కి బద్ధశత్రువుగా ఉండే రామోజీరావు తనకి కూడా శత్రువు అని ప్రస్తుతం కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో రామోజీరావుని దూరం పెట్టిన కేసీఆర్ త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలివుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మరియు నాగార్జునతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల మంతనాలు జరపడం జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో ఫిలం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు టాలీవుడ్ స్టార్ హీరోలతో తలసాని భేటి గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రామోజీరావుకి ఊహించని దెబ్బ తగిలినట్లయింది అని ఇండస్ట్రీలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు.