‘ధైర్యంగా కలలు కంటూ తన లక్ష్యసాధన కోసం ప్రయాణించే ఓ యువతి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటోంది కీర్తిసురేష్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మిస్ ఇండియా’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. నరేంద్రనాథ్ దర్శకుడు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదలకానుంది. మహిళ దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని కొత్త స్టిల్ను కీర్తిసురేష్ అభిమానులతో పంచుకున్నది. ఇందు లో కుర్తా, జీన్స్లో సంప్రదాయరీతిలో చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనిపిస్తున్నది. జీవితం పట్ల సానుకూల దృక్పథమున్న యువతిగా కీర్తిసురేష్ పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తానికి కుటుంబ విలువల్ని జోడి స్తూ ఆద్యంతం వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ధైర్యవంతమైన కలలు
Related tags :