WorldWonders

లాయర్లకు మాత్రమే సుప్రీంలోకి అనుమతి

Indian CJI Bobde Puts Restrictions On CourtRoom Appearances Due To Corona

లాయ‌ర్లు మాత్ర‌మే కోర్టు రూమ్‌లోకి రావాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో  ఢిల్లీలోని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. 

కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసుల‌ను మాత్ర‌మే విచారిస్తామ‌ని కూడా సుప్రీం పేర్కొన్న‌ది.

ఆయా కేసుల‌కు సంబంధించిన లాయ‌ర్లు మాత్ర‌మే కోర్టు రూమ్‌కు రావాల‌ని, ఇత‌రుల‌ను అనుమ‌తించ‌మ‌ని కోర్టు చెప్పింది.

చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.