WorldWonders

కుక్కలతో కలిసి పాలు నాకాడు

కుక్కలతో కలిసి పాలు నాకాడు

లాక్ డౌన్ 21 రోజులు గడిచిన తరవాత పేదల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆగ్రాలోని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది. ఆగ్రాలోని రామ్ బాగ్ చౌరాహ్ వద్ద ఒక పాల క్యాన్ రోడ్డు మీద ఒలికి పోయింది. వెంటనే కుక్కలు ఆ పాలను నాకడం మొదలుపెట్టాయి. వాటికి లాక్ డౌన్ కారణంగా తిండి దొరకని ఒక మనిషి కూడా తోడయ్యాడు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది పేదలు ఆకలికి అల్లాడి పోతున్నారు. ఆకలికి తాళలేక లక్షలాది మంది కాలి నడకన తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. పోతున్నారు. మన దేశంలో అనియత రంగంలో పని చేస్తున్న 40 కోట్ల మంది భారతీయులు మరింతగా పేదరికంలో కూరుకుపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరించింది.