Politics

తెదేపా నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు వైకాపాలోకి రెడీ!

Three TDP MLAs ready to jump to YSRCP

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సర్వ సన్నద్ధమయ్యిందట. 

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరు సాంబశివరావు, ఏ క్షణాన అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయి పార్టీ కండువా కప్పుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా వుంటే, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్‌, మద్దాలి గిరి ఇప్పటికే టీడీపీని వీడారు.

మొత్తంగా చూస్తే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే వ్యూహంతో వైసీపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం.