Politics

నేను డిమాండ్ చేస్తున్నాను

To conduct enquiry into attacks by YSRCP

రాష్ట్రంలో రోజురోజుకూ మితిమీరుతున్న వైసీపీ రౌడీ మూకల ఆగడాలు, అరాచకాలకు కళ్లెం వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

సీఎం జగన్, డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని వైసీపీ రౌడీమూకలను కట్టడి చేయాలని ఆయన కోరారు.

పెదకూరపాడు నియోజకవర్గం ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీ మూకల దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు.

మహిళలు, చిన్నారులపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వదిలేసి.. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం వైసీపీ ఆటవిక రాజ్యానికి నిదర్శనమని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్డులపై కూడా దాడి చేశారన్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఎదురు కేసులు బనాయించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు భద్రత కల్పించాలని కోరారు.

బాధితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.