Politics

నిమ్మగడ్డకు కాంగ్రెస్ బాసట

Congress Party Drops Caveat Petition In Supreme Court For Nimmagadda

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని వైకాపా ఎమ్మెల్యేలు  ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్‌ పిటిషన్‌ వేశారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.