Devotional

యాదాద్రిలో నేడు భక్తుల సందడి

యాదాద్రిలో నేడు భక్తుల సందడి

తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం భక్తుల దర్శనానికి నేడు తిరిగి తెరుచుకుంది.

భక్తుల దర్శనాల నిమిత్తం 78 రోజుల అనంతరం ఆలయాన్ని సోమవారం నాడు తిరిగి తెరిచారు.

యాదాద్రి కొండపై గల బాలాలయంలో స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయంలో భక్తుల రక్షణ నిమిత్తం తీసుకున్న జాగ్రత్త చర్యలను కలెక్టర్‌ పరిశీలించారు.

క్యూలైన్‌తో పాటు ఆలయంలోని పలు ప్రాంతాల్లో హ్యాండ్‌ శానిటైజర్లను ఏర్పాటు చేశారు. 

భౌతికదూరం పాటిస్తూ నేడు ఆలయ సిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు స్వామి దర్శనానికి అనుమతించారు.