NRI-NRT

సిలికానాంధ్ర “సంపద” ఆధ్వర్యంలో సంగీత పోటీలు

సిలికానాంధ్ర

ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి,భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో తమ తమ గురువుల వద్ద శిక్షణ పొందుతన్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరిక్షలు నిర్వహించి , అకడమిక్ క్రెడిట్స్ తో కూడిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్స్ అందించే అకాడెమి పేరు SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy). ఎన్నో ప్రతికూల పరిస్టితుల మధ్యన, గత ఏప్రిల్ మరియు మే నెల లలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అధికారుల అంతర్జాల పర్య వేక్షణ ద్వారా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి,భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యం లో శిక్షణ పొందుతూ, సంపద లో నమోదు చేసుకున్న దాదాపు 1500 కి పైగా విద్యార్ధులకు పరీక్షలు మరియు మూల్యాంకనం నిర్వహించి, ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికేట్ లలో ధృవీకరణ పత్రాలు అందించడం జరిగింది. విద్యార్ధులు ఎవరూ తమ స్వంత ఇళ్ళ నుండి బయటకు రాకుండా సునాయాసంగా మరియు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, విశ్వ విద్యాలయ అధికారులు, విద్యార్ధులు,తల్లి దండ్రులు, విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలను అందుకున్నదని, ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి , తెలుగు విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శ్రీమతి డా. రెడ్డి శ్యామల నాయకత్వంలోని అధికారుల బృందం కృషి ఎంతో ఉన్నదని సంపద డీన్ మరియు అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్ సైట్ ద్వారా తక్షణం నమోదు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రపంచమంతటా కరోనా వ్యాధి విస్తరిస్తూ ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటున్న ప్రతికూల సమయంలో, సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమి (సంపద) అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల పిల్లలు మరియు పెద్దల మనసుకు స్వాంతన చేకూర్చే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అమెరికా లో నివసిస్తున్న చిన్నారులకు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద అభిరుచిని పెంచటానికి, అన్నమయ్య, రామదాసు, పురందరదాసు లాంటి వాగ్గేయ కారుల గొప్పతనాన్ని రాబోయే తరం చిన్నారులకు పరిచయం చేయటానికి అంతర్జాలం ద్వారా ఒక వేదికను కల్పించి, వారు రచించిన కీర్తనల మీద పోటీల నిర్వహణకు సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమి చేపట్టింది. అమెరికావ్యాప్తంగా 550 మంది ఆసక్తితో నమోదు చేసుకొన్నారని, తొలి విడతగా జూన్ లో ఐదు నగరాలలో నిర్వహించిన ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన దాదాపు 65 మంది జూలై 11 మరియు 12 తేదీలలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని సిలికానాంధ వాగ్గేయకార ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తెలిపారు. ఈ పోటీలకు సాంకేతిక నిర్వహణ బాధ్యతను సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి నిర్వహిస్తున్నారు.

సంపద నిర్వహిస్తున్న వాగ్గేయకార వైభవం కార్యక్రమానికి వస్తున్న అపూర్వ స్పందనను దృష్టిలో పెట్టుకొని, ఆగస్టు 8-9 తేదిలలో కర్ణాటక సంగీత వాద్య పరికరాలయిన వీణ, వయోలిన్, ఫ్లూట్, మృదంగంలలో కుడా అంతర్జాలం ద్వారా పోటీలు నిర్వహించటానికి సంపద శ్రీకారం చుట్టింది. కర్ణాటక సంగీత వాద్య పోటీలలో పాల్గొను వారు, వారి వయసును బట్టి, కర్ణాటక సంగీతప్రపంచంలో త్రిమూర్తులుగా పిలువబడే త్యాగయ్య, దీక్షితార్ మరియు శ్యామశాస్త్రిలు రచించిన కృతులను ఎంచుకోవాలని, రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org వెబ్ సైట్ ని సందర్శించ వచ్చని, ఈ రెండు కార్యక్రమాలు పేస్ బుక్, యుట్యూబ్ లాంటి సామాజిక మాధ్యామాల ద్వారా ప్రత్యక్షం గా వీక్షించ వచ్చని, సంపద అధ్యక్షులు దీనబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సంపద నిర్వహిస్తున్న వాగ్గేయయకార వైభవం కార్యక్రమం విజయవంతం కావడానికి, నార్త్ కరోలినా నుంచి గౌతమి మద్దాలి, మల్లికా వడ్లమాని, వర్జీనియా నుంచి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుభ్రమణ్యం, న్యూజెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి,రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ళ, నారాయణన్ రాజు, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తదితరులు సమర్ధవంతమయిన నాయకత్వాన్ని అందిస్తున్నారు.