Movies

సుశాంత్ ఖాతాల నుండి కోట్ల రూపాయిలు మాయం

సుశాంత్ ఖాతాల నుండి కోట్ల రూపాయిలు మాయం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసును ఎందుకు ఆర్థిక కోణంలో విచారణ చేయటం లేదని బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ముంబయి పోలీసులను ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.50కోట్లు విత్‌ డ్రా అయ్యాయని, కేవలం ఏడాది కాలంలో రూ.15కోట్ల నగదును డ్రా చేశారని తెలిపారు. ‘‘గత నాలుగేళ్లలో సుమారు రూ.50కోట్లు సుశాంత్‌ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే అవన్నీ విత్‌ డ్రా కావడం. ఏడాది కాలంలో రూ.17కోట్లు జమ అయితే, అందులో రూ.15కోట్లను విత్‌డ్రా చేశారు. ఈ కేసు విచారణలో ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్‌. ఈ విషయంలో మేము మౌనంగా ఉండాలనుకోవడం లేదు. దీనికి ముంబయి పోలీసులు సమాధానం చెప్పాలి’’ అని డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.