Sports

ధోనీ రిటైర్మెంట్ నేను ఒప్పుకోను

ధోనీ రిటైర్మెంట్ నేను ఒప్పుకోను

వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ ఆడిన తర్వాతే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైన మహీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు జట్టుకు చేసిన సేవలపై క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమ్‌ఇండియాకు అతడు అందించిన విజయాల్ని, జట్టును నడిపించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన అక్తర్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ధోనీ ఆటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.