Politics

గవర్నర్‌ను పరామర్శించిన కేసీఆర్

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, కరోనాపై కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం.

తమిళిసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్‌ పరామర్శించారు.

సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులను కేసీఆర్ కోరారు.

అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం కావాలని కోరారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను సీఎం ఆదేశించారు.