Movies

పటానీ మస్త్ పటాయించింది

పటానీ మస్త్ పటాయించింది

కథానాయిక దిశా పటానీ అతి తక్కువ కాలంలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో వేగంగా 40 మిలియన్ల ఫాలోవర్స్‌ (ఇన్‌స్టాగ్రామ్‌) సాధించిన నటిగా గుర్తింపు పొందారు. ఈ విషయంలో దిశా గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న అలియా భట్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలను బీట్‌ చేయడం గమనార్హం. దిశా 2016లో ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’తో బాలీవుడ్‌కు నటిగా పరిచయం అయ్యారు. ‘భారత్‌’లోని ఓ గీతంలో తన డ్యాన్స్‌, అందంతో ఆకట్టుకున్నారు. ‘మలంగ్‌’లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ బ్యూటీ తరచూ డ్యాన్స్‌, జిమ్‌ వీడియోలను ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు. ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు అనేకమార్లు ఫిదా అయ్యారు. పరిశ్రమకు పరిచయమైన దాదాపు నాలుగేళ్లలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం.