Devotional

5.5లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం

5.5లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవం

ఈ ఏడాది అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలిగిపోనుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం.. ప్రపంచ రికార్డు సాధించనుంది. అందుకోసం మట్టి ప్రమిదలతో 5.5 లక్షల దీపాలు వెలిగించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు వర్చువల్‌గా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబరు 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది. 2017లో ఈ దీపోత్సవాన్ని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ప్రారంభించింది. దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది.