Politics

అగ్రవర్ణ పేదలకు జగన్ సర్కార్ రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకు జగన్ సర్కార్ రిజర్వేషన్లు

వైయస్‌.జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు
విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్తింపు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్‌.జగన్‌ సర్కార్‌
నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు
కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింపు
మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచిన ప్రభుత్వం
రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచిన ప్రభుత్వం
గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెమో జారీ
రాష్ట్రంలోని తహశీల్దార్‌ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం
రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు