NRI-NRT

రైతులకు ఎరువులు అందించిన ప్రవాసాంధ్రుడు రామ్‌చౌదరి

రైతులకు ఎరువులు అందించిన ప్రవాసాంధ్రుడు రామ్‌చౌదరి

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో తానా ఆధ్వర్యంలో ఎరువులు పంపిణీ జరిగింది. తానా ఫౌండేషన్ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్, మాజీ జెడ్పిటిసి ఉప్పుటూరి సీతామహాలక్ష్మిలు ఎరువుల పంపిణిని ప్రారంభించారు. ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్ చౌదరి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు శ్రీకాంత్ చెప్పారు. ఈకార్యక్రమంలో మాజీ గ్రామ ఉపసర్పంచ్ ఉప్పుటూరు చిన్న రాములు, తెలుగుదేశం నాయకులు గుంటుపల్లి సదాశివరావు, శ్రీనివాసరావు, షేక్ కాలేశా వలి తదితరులు పాల్గొన్నారు.