Health

మనల్ని ఫిదా చేసిన పాకిస్తానీ రుచి

మనల్ని ఫిదా చేసిన పాకిస్తానీ రుచి

రూఅఫ్ఘా .. ఏ కిరాణా కొట్టుకెళ్లినా, ఏ సీజన్లో అయినా తేలిగ్గా దొరికే ఈ ఎర్రరంగు పానీయం గురించి తెలియని వాళ్ళు ఉండరేమో ! ఉత్తరాది వాళ్లకయితే ఇంట్లో ఏ వేడుక జరిగినా రూఅష్టా ఉండి తీరాల్సిందే. దిల్లీ వెళ్తే అందరూ తాగే మొహబ్బత్కి షర్బత్ని దీంతోనే తయారుచేస్తారు. 113 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పానీయం గురించి మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఇది భారతీయ పానీయం కాదు. పాకిస్తానీ ఔషధం. పాకిస్తానికి చెందిన యునాని వైద్యుడు హకీమ్ అబ్దుల్ మాజిద్ మొదట దీనిని వడదెబ్బ నుంచి రక్షించి.. వ్యాధినిరోధక శక్తిని పెంచే టానిక్గా తయారుచేశాడు. అప్పటికి దేశ విభజన జరగక పోవడంతో… పాకిస్తాన్లో కన్నా దీన్ని ఢిల్లీ, అఫ్ఘనిస్తాన్లలో ఎక్కువ వాడేవారు. దాంతో మాజిద్ దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. ప్రత్యేకమైన లోగో చేయించారు. వందేళ్ల క్రితం రూపొందించిన ఆ లోగోనే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో పుదీనా, ద్రాక్ష, క్యారెట్, పుచ్చకాయ, గసగసాలు, కొత్తిమీర, పాలకూర, లిల్లీపూలు, కలువలు ప్రధానంగా ఉంటాయి. అయితే దేశ విభజన తర్వాత కొన్నాళ్లపాటు ఈ రూఅష్ఠా దొరకలేదు. కారణం విభజన సమయంలో చెట్టుకొకరు పుట్టకొకరైన కుటుంబాల్లో మాజిద్ కుటుంబం కూడా ఉంది. తర్వాత కొన్నాళ్లకు అతని కుమారుడు బంగ్లాదేశ్ చేరుకుని అక్కడ నుంచి ఈ పానీయాన్ని తయారుచేయడం. మొదలుపెట్టాడు. అలా మనదేశంతోపాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇంకా మరికొన్ని యూరోప్ దేశాల్లో కూడా ఈ పానీయానికి అభిమానులున్నారు. రూ .600 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ రూలష్ణా టెట్రా ప్యాకింగ్లోనూ రానుంది.