Movies

ఇంకెవర్నీ ప్రేమించను

ఇంకెవర్నీ ప్రేమించను

నాగ చైతన్యతో వైవాహిక జీవితం నుంచి విడిపోవడం ఎంతో సంఘర్షణతో జరిగిందని వెల్లడించింది హీరోయిన్‌ సమంత. విడాకుల సమయంలో తనపై ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారన్న సమంత..విడిపోయేందుకు 250 కోట్ల రూపాయల తీసుకున్నాననే వార్తలూ అసత్యమని చెప్పింది. ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సమంత నాగ చైతన్యను మాజీ భర్త అని పిలవాలని సూచించింది. ఆయనతో విడాకుల విషయం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సమంత మాట్లాడుతూ…‘మా మధ్య ఎలాంటి అనుబంధం ఉండేది కాదు. ఆ దూరం కొనసాగుతూ వచ్చింది. మేమిద్దరం ఒకే గదిలో ఉంటే ఆ గదిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా చూసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. విడాకులు తీసుకోవడం ఎంతో సంఘర్షణతో జరిగింది. ఆ సమయంలో బాధకు గురయ్యా. డివోర్స్‌ సందర్భంలో నాపై ఎంతో అసత్య ప్రచారం చేశారు.

నేను 250 కోట్ల రూపాయల భారీ మొత్తం డిమాండ్‌ చేశాననే వార్తలూ బాధపెట్టాయి. ఐటీ దాడులు జరిగి ఆ డబ్బు లేదని ప్రపంచానికి చెబితే బాగుండును అనుకున్నాను. ఇకపై నా జీవితంలో ప్రేమ ప్రసక్తి లేదు. ఇంకెవర్నీ ప్రేమించాలనుకోవడం లేదు. విడాకుల తర్వాత మానసికంగా బలంగా మారాను. కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నా’ అని చెప్పింది.