NRI-NRT

వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ తెదేపా ముందుకు రావాలి

వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ తెదేపా ముందుకు రావాలి

వరద బాధితులను ఆదుకోవాలని ఎన్ఆర్ఐ టీడీపీ అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. ఆదివారం అమెరికాలోని బే ఏరియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆన్ లైన్ లో, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రులు వరదల కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. చంద్రబాబు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తెలుగుదేశం పార్టీ బాధితులకు సహాయం అందించడం అభినందనీయం అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉంటే పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చారని దుయ్యబట్టారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు చంద్రబాబునాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు నిరంతరం కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో.. వెంకట్ కోగంటి ప్రసాద్, మంగిన, వీరు ఉప్పల, శ్రీకాంత్ దొడ్డపనేని, లక్ష్మణ్ పర్చూరి, విజయకృష్ణ గుమ్మడి, శ్రీని వల్లూరిపల్లి, చంద్ర గుంటుపల్లి, సతీష్ అంబటి, సతీష్ చిలుకూరి, రజని కాకరాల, జెట్టి వెంకయ్య, హేమారావు నందిపాటి, భరత్ ముప్పిరాల, లీయోన్ రెడ్డి, సుధీర్ వున్నం, విజయ్ అసురి, శ్రీలు వెలిగేటి, శ్రీదేవి, భాస్కర్ వల్లభనేని, రాజా కొల్లి తదితరులు పాల్గొన్నారు.