Movies

ఆ హీరోయిన్ ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడట!

ఆ హీరోయిన్ ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడట!

సాధారణ మహిళలకే కాదు పోకిరీల నుంచి నాయికలకూ వేధింపులు తప్పడం లేదు. ప్రేమిస్తున్నానంటూ తనను ఓ వ్యక్తి ఆరేళ్లుగా ఇబ్బందిపెడుతున్నాడంటూ హీరోయిన్ నిత్యా మీనన్ వెల్లడించింది. తరుచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడిగేవాడని, తనకే కాకుండా తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వేధించాడని ఆమె తెలిపింది. ఇటీవల తన ప్రేమ, పెళ్లి వార్తల వ్యాప్తి వెనకా అతని హస్తమే ఉందని నిత్యా చెప్పింది. తన కొత్త సినిమా ‘19(1)(ఏ)’ ప్రచార కార్యక్రమాల సందర్భంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ…‘సంతోష్ వర్కే అనే యూట్యూబర్ పెళ్లి చేసుకోమంటూ ఆరేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్లకు ఫోన్లు చేసేవాడు. అతని 30 ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేశా. కుటుంబ సభ్యులు పోలీస్లకు ఫిర్యాదు చేస్తామంటే నేనే వద్దని చెప్పా. అతని మానసిక పరిస్థితి బాగోలేదనుకున్నా. ఇటీవల నా ప్రేమ, పెళ్లి వార్తల సృష్టిలోనూ అతని హస్తం ఉంది. ఇన్నాళ్లూ పోనీలే అనుకున్నా..ఇకపై అతన్ని ఉపేక్షించను’ అని చెప్పింది.